- Advertisement -
బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ కజిన్ తానీషా ముఖర్జీతో తో ఓ సంవత్సరం పాటు డేటింగ్ చేశాడు నటుడు అర్మాన్ కోహ్లీ.తరువాత కాలంలో వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో విడిపోయారు.తానీషాతో విడిపోయే సమయంలో అర్మాన్ని కొట్టినట్లు సమాచారం.దీని కారణంగానే ఆమెపై ద్వేషాన్ని పెంచుకున్నాడు అర్మాన్.దీంతో నటి రాణీముఖర్జీ నివాసం ముందు మూత్రం పోశాడట.
అర్మాన్ వికృతి చేష్టలకు పాల్పడుతున్న సమయంలో అక్కడ ఉన్న మీడియా వర్గాలు ఫోటోలు తీయడంతో విషయం బయటకి వచ్చింది. అర్మాన్ పై ఇప్పటికే బాలీవుడ్ లో ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాదిలో నీరూ రాంధవ అనే అమ్మాయితో డేటింగ్ చేసి, ఆమెను ఇష్టమొచ్చినట్లు గాయపరిచి ఇంట్లో నుండి గెంటేశాడు. ఇప్పుడు ఇలాంటి వార్తలు రావడంతో అతనికి సినిమాలలో అవకాశాలు రావడం కష్టమనే అంటున్నారు.