Thursday, April 25, 2024
- Advertisement -

సాయం చేయడంలో కూడా ప్రభాస్ బాహుబలే..!

- Advertisement -

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్స్ కూడా సాయం చేస్తున్నారు. అటు కేంద్రం ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ మేరకు తాజాగా ప్రభాస్ చేసిన ప్రకటన చూసి షాక్ అవుతున్నారు జనం. విషయంలోకి వెళ్తే.. దేశ ప్రజలంతా ఏప్రిల్ 15 దాకా లాక్‌డౌన్ పాటించాలని ప్రధాని ఇచ్చిన ఆదేశాల మేరకు అందరూ ఇల్లు విడిచి బయటకు రావడం లేదు.

ఈ పరిస్థితుల్లో పేద ప్రజల అవసరాలు తీర్చాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ మేమున్నాం అంటూ ముందుకొస్తున్నారు టాలీవుడ్ సెలెబ్రిటీలు. ఇప్పటికే నితిన్, త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్, కొరటాల శివ, రామ్ చరణ్, అనిల్ రావిపూడి వంటి వారు తమ తమ ఆర్థిక సాయం ప్రకటించగా.. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన వంతుగా ఏకంగా 4 కోట్ల రూపాయల ఆర్థికసాయం అందించారు. ముందుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కలిసి కోటి రూపాయాల భారీ విరాళాన్ని ప్రకటించిన ప్రభాస్.. ఆ తర్వాత ప్రధాన మంత్రి సహాయ నిధికి ఏకంగా 3 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ఈ సంచలన ప్రకటన చూసి రెబల్ స్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు, కేంద్రానికి కలిపి పవన్ కళ్యాణ్ 2 కోట్లు ఇస్తే.. దానికి రెండింతలు విరాళం ప్రకటించి ప్రభాస్ సంచలనం సృష్టించారు. ప్రభాస్ గొప్పమనసు చూసి నెటిజన్లు ఫిదా అవుతూ పెద్దఎత్తున కామెంట్స్ పెడుతున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా లో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -