‘వినయ విధేయ రామ’ చిత్రంతో భారీ ఫ్లాప్ ని మూటగట్టుకున్న బోయపాటి శ్రీను మెగా అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత చాలా టైం తీసుకుని మరీ బాలకృష్ణ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.. మరో వైపు నందమూరి బాలకృష్ణ కూడా గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ రెండు పార్ట్ లు, రూలర్ సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.. దాంతో మళ్ళీ తనకు అచ్చోచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను తో చేతులు కలిపాడు బాలయ్య.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది.. త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..
చిత్రం నుంచి టీజర్ రాగ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.. ఇందులో పంచెకట్టులో మీసం మెలితిప్పుతూ మాస్ లుక్ లో బాలయ్య అలరించాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర.. రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం. ఇక బిబి3 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. సింహ, లెజెండ్ లాంటి సినిమా ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా విషయంలో బోయపాటికి ఇంత కన్ ఫ్యుజ్ ఏంటి అని అభిమానులు అంటున్నారు.. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ… షూటింగు ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి. దానికి కారణం.. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక లో ఇంకా స్పష్టత రాకపోవడమే. ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు.ఈ సినిమాలో విలన్ ఎవరు? అనే విషయంలోనూ స్పష్టత లేదు. కెమెరామెన్, ఫైట్ మాస్టర్లు, సంగీత దర్శకుడు.. తప్ప మరెవ్వరి పేర్లూ ఖరారు కాలేదని, అవన్నీ ఫైనల్ అయి, వాళ్ల కాల్షీట్లు దొరికితే తప్ప – షెడ్యూల్ సెట్ చేయడం కుదరదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బోయపాటి ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలుపెడతాడో అని ఎదురుచూస్తున్నారు..
ఖిలాడి తో రవితేజ మార్కెట్ పెంచుకునేనా..?
నటి రోహిణి తమ్ముడు టాలీవుడ్ లో పెద్ద విలన్ అని తెలుసా ?