Thursday, March 28, 2024
- Advertisement -

‘ఆదిత్య 369’ దర్శకుడితో బాలయ్య

- Advertisement -

సింగీతం శ్రీనివాసరావు.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. 1972లో ‘నీతి నిజాయితీ’ అనే సినిమాతో మొట్టమొదటిసారిగా దర్శకుడిగా మారిన సింగీతం శ్రీనివాసరావు ఆ తరువాత అంచెలంచెలుగా ఇండస్ట్రీలో ఎదుగుతూ వచ్చారు. కేవలం దర్శకుడి గా మాత్రమే కాక నిర్మాతగా, కథా రచయితగా, మరియు కంపోజర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆఖరి సారిగా ఆయన ‘వెల్కమ్ ఒబామా’ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. 2013లో విడుదలైన ఈ సినిమా తర్వాత మళ్లీ సింగీతం శ్రీనివాసరావు సినిమాల వైపు చూడలేదు. ప్రస్తుతం చెన్నైలో నివాసముంటున్న ఈయన మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నారు అంటూ సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

దానికి కారణం నందమూరి బాలకృష్ణ. తాజాగా సింగీతం శ్రీనివాసరావు సోషల్ మీడియా ద్వారా నందమూరి బాలకృష్ణ చెన్నై లోని తన ఇంటికి వచ్చారని వారిద్దరి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ తెలియజేశారు. ఎప్పుడో 1991లో బాలకృష్ణ హీరోగా నటించిన ‘ఆదిత్య 369’ సినిమాకి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఆ తరువాత అదే సినిమాకు సీక్వెల్ తీయబోతున్నారని, దాంట్లో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా నటిస్తాడని పుకార్లు బయటకు వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. మరి ఇప్పుడు సడన్ గా బాలకృష్ణ సంగీతం శ్రీనివాసరావును ఎందుకు కలిశారు అనే విషయంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -