వైసీపీ ఎమ్మెల్యే రోజా ,నటుడు,నిర్మాత బండ్ల గణేష్ కొంతకాలం క్రితం ఓ టీవీ ఛానెల్లో మాట్లాడుతూ…. బండ బూతులు తిట్టుకున్నారు. ‘పళ్లు రాలగొడతా’, ‘బ్రోకర్ వి నువ్వు’ అని రోజా అంటే…‘నీ పళ్లు రాలిపోతాయి’, అంటూ బండ్ల గణేష్ పరస్పరం దూషించుకోవడం సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే.తాజా ఈ విషయంపై స్పందించాడు బండ్ల గణేష్.రోజా గారి విషయంలో నేను నోరుజారడం జరిగింది. ఆ రోజున అలా మాట్లాడాల్సి కాదు.ఈ సంఘటన తరువాత నాకు చాలా బాధేసింది.తొందరపడి అంత మాటన్నానే అనిపించింది. ఈరోజుకి కూడా ఆమె నాకు సోదరి లాంటిదే.
నా సోదరి రోజాగారికి నేను ఏంటో తెలుసునని ఆ క్షణాన ఆవేశంలో అనుకున్నామేగానీ కాని, నాకు రోజాగారికి ఎటువంటి విభేదాలు లేవని తెలిపాడు బండ్ల గణేష్. ‘మీటూ’ గురించి పలువురు సినీ ప్రముఖులపై వస్తున్న ఆరోపణల గురించి బండ్లగణేష్ ని ప్రశ్నించగా.. తాను రాజకీయనాయకుడిగా వచ్చాను తప్ప, సినిమా వ్యక్తిగా రాలేదని, కనుక దీనిపై స్పందించనని చెప్పారు.బండ్ల గణేష్ ఇటీవలే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.ఆయన కాంగ్రెస్ పార్టీ తరుపున జుబ్లీహిల్స్లో పోటీ చేయనున్నారు.