Tuesday, April 16, 2024
- Advertisement -

బెల్లంకొండ శ్రీను ఎటు వెళ్తున్నాడు

- Advertisement -

టాలీవుడ్లో వరుస సక్సెస్ చిత్రాలు చేసి ఓ రేంజ్లో నటీనటులను ఆడుకున్న నిర్మాతగా బెల్లంకొండ సురేష్ కు పేరుంది. ఆ తర్వాత అదే దూకుడు అతని కెరియర్ ను ఇబ్బందిల్లో పెట్టేసింది.

దీంతో కాస్త లేటుగా కుమారుడి రాకతో కోలుకున్నాడు. అల్లుడు శీను కమర్శియల్ గా వర్కవుట్ కాకపోయినా.. మంచి పేరు తెచ్చిపెట్టింది.అయితే ఆతర్వాత సినిమాలు ఫైనాన్షియల్ గా మరింత సంప్ లోకి వెళ్లిపోయేలా చేసాయి. కాని అతని కొడుకు ఐతే రీసెంట్ గా వచ్చిన జయ జానకి నాయక సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు.. బెల్లంకొండ . అతని కుమారుడు శ్రీనివాస్ …మీద తాను పెట్టుకున్న నమ్మకం వమ్ముకాలేదని అర్ధం చేసుకున్నాడు. అందుకే కాబోలు లక్ష్యం’, ‘లౌక్యం’. ‘డిక్టేటర్’ చిత్రాల దర్శకుడు శ్రీవాస్ కు ఈసారి ఛాన్స్ ఇచ్చాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ‘సాక్ష్యం’ అనే టైటిల్ ఖరారైంది. అభిషేక్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది.దీనికి బ్యాక్ సైడ్ బెల్లంకొండ సురేష్ ఉన్నాడని వేరే చెప్పనక్కర్లేదు.

పంచభూతాలు భారతీయత కథాంశంతో వస్తున్న ఈ మూవీ రెగ్యులర్ మూవీస్ కి డిఫరెంట్ గా ఉంటుందని రైటర్ బుర్రా సాయిమాధవ్ అంటున్నారు. మీనా, జగపతిబాబు, శరత్ కుమార్, పోసాని, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. పీటర్ హెయిన్ – యాక్షన్ , శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.అంతా భాగానే ఉంది కాని ఈసినిమా అక్కినేని అఖిల్ నటించిన అఖిల్ చిత్రం మాదిరిగా ఎక్కడికో వెళ్లిపోతుందని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -