బిగ్బాస్లో ఈరోజు.. రేపు కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ప్రేక్షకులు కోరుకున్న కోరిక తీరబోతోంది. బిగ్బాస్ ప్రేక్షకులంతా అసహ్యించుకుంటున్న గ్యాంగ్పై ఈ వారం వేటు పడబోతోంది. బిగ్బాస్ హౌస్లో తేజస్వి, తనీష్, సామ్రాట్, దీప్తి సునయన జట్టుగా మారిపోయి.. మిగతా వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో ఈ గ్యాంగ్ను చూడాలంటేనే కంపరమెత్తుతోందంటూ.. ప్రేక్షకులు తెగ కామెంట్లు పెడుతున్నారు. వీళ్ల వల్ల బిగ్బాస్ షో చూడాంలటేనే అసహ్యంగా ఉందని.. యూట్యూబ్ వేదికగా విరుచుకు పడుతున్నారు. వీళ్లు ఎప్పుడు ఎలిమినేషన్కు వస్తారా.. అని ఎదురుచూశారు. వారి ఎదురుచూపులు ఫలించి ఒకేసారి తేజస్వి, తనీష్, సామ్రాట్ ఎలిమినేషన్లోనికి వచ్చారు. దీంతో ప్రేక్షకులు అనుకున్నట్టుగానే వీళ్లలో ఖచ్చితంగా ఒకరిని ఇంటికి పంపడానికి ఓట్లు వేయకుండా తెగ ప్రచారం చేశారు.
వారి శ్రమ ఫలించింది.. వీరు ముగ్గురిలో తనీష్కు కొంచెం ఎక్కువ ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. మిగతా సామ్రాట్, తేజస్విల్లో ఒకరు గ్యారెంటీగా ఇంటికి వెళ్లిపోవడం ఖాయమైంది. శుక్రవారం రాత్రితో ఓటింగ్ ముగిసింది. నిన్నటి వరకూ సామ్రాట్ తక్కువ ఓట్లతో బయటకు వెళ్లిపోయేందుకు ఉండగా.. ఒకేరోజులో సామ్రాట్ తేజస్వి కంటే అధిక ఓట్లను సాధించాడు. దీంతో తేజస్వి.. ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ తేజస్విని బిగ్బాస్ హౌస్ నుంచి పంపించేందుకు నాని, నిర్వాహకులకు ఇష్టం లేదనే వార్తలు వస్తున్ననేపథ్యంలో.. ఆమె కాకుంటే.. సామ్రాట్ వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
బిగ్బాస్ ప్రేక్షకులు మాత్రం సామ్రాట్ హౌస్లో ఉన్నా అంత ఇబ్బంది లేదని.. ఎలాగైనా తేజస్విని పంపించేయాలంటూ తెగ విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రేక్షకులే బిగ్బాస్లో న్యాయ నిర్ణేతలు. వారు ఏం కోరితే.. అదే నిర్వాహకులు చేస్తుంటారు. ప్రస్తుతం వారి కోరిక ప్రకారమైతే.. మాత్రం తేజస్విని జన్యూన్గానే ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. తేజస్వికి సైతం ఈ విషయం అర్థమై.. గత రెండు రోజులుగా.. తన పంథాకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సాధారణంగా తేజస్వి ఎప్పుడూ ఎదుటి కంటెస్టెంట్లపై నోరేసుకుని పడిపోవడం, వారిని కించపరిచేలా మాట్లాడ్డం చేస్తుంటుంది. కానీ.. గత రెండు రోజులుగా నోటిని అదుపులో పెట్టుకుని.. ఎక్కడా నోరు జారకుండా జాగ్రత్త పడుతోంది.
అయితే.. ప్రేక్షకులు గత 40 రోజులుగా తేజస్వి ప్రవర్తనతో తెగ విసిగిపోయారు. అందుకే.. తేజస్వికి ఓట్లు వేసేవాళ్లు సైతం లేకుండాపోయారు. ఎవరో ఎక్కడో ఈమె గురించి బిగ్బాస్ హౌస్లోని ప్రవర్తన గురించి తెలియక గతంలో అభిమానించేవాళ్లుంటే వేయాలి.. తప్ప ఇప్పుడు చూసిన వాళ్లు మాత్రం ఒక్క ఓటు కూడా వేయరు. ఈ లెక్కన తేజస్వి.. తట్టాబుట్టా సర్దేసుకుని వెళ్లిపోవడం ఖాయంగానే పరిస్థితులన్నీ చూస్తే అర్థమవుతుంది. ప్రేక్షకుల తీర్పు ఇలా ఉంటే.. బిగ్బాస్, నాని మనసులో ఏముందో.. ఆదివారం రాత్రితో తేలిపోనుంది.