నామినేషన్ ప్రక్రియ అంటే ఇంటి సభ్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. సోమవారం వచ్చిందంటే ఎవరిని నామినేట్ చేయాలి? అంటూ ఆలోచించుకుంటూ ఉంటారు.మూడవ సీజన్ లో మరో ఎలిమినేషన్ ఎపిసోడ్ కు నాంది పడింది.ఇప్పటికీ యాభై రోజులు పూర్తయ్యాయని, ఇకపై కఠినతరంగా ఉంటుందని ఇంటి సభ్యులను బిగ్బాస్ హెచ్చరించాడు.
అయితే ఈ వారంలో ఎలిమినేట్ అయ్యే వారిలో శిల్పా చక్రవర్తి, హిమజ, శ్రీముఖి, పునర్నవి, మహేశ్ ఉన్నారు. వీరితో పాటు రవి కూడా తొలుత నామినేట్ అయినప్పటికీ, హౌస్ కెప్టెన్ బాబా భాస్కర్ పుణ్యమాని రవి తప్పించుకున్నాడు.ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యే వారిని ఎంపిక చేసేందుకు సైతం బిగ్ బాస్ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు.
ఇక నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులను రెండు టీమ్స్గా విడగొట్టాడు. బాబా భాస్కర్ కెప్టెన్ అయిన కారణంగా ఏ గ్రూప్లోనూ సభ్యుడు కాదంటూ తెలిపాడు. ఓ టీమ్లోని సభ్యుడు ఇంకో టీమ్లోని ఇద్దరు కంటెస్టెంట్లను నామినేట్ చేయాల్సి ఉంటుందని తెలిపాడు. వరుణ్, వితికా, రాహుల్, పునర్నవి, శిల్పాలను ఓ టీమ్ మేట్స్గా.. శ్రీముఖి, హిమజ, రవి, శివజ్యోతిలను మరో టీమ్స్గా విభజించాడు.
అయితే ఇప్పుడు అందరి టార్గెట్ నామినేషన్స్లో వైల్డ్ కార్డ్ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తినేచేసినట్టు కనిపిస్తోంది.అయితే ఈసారి రాహుల్ను శ్రీముఖి నామినేట్ చేయకపోవడం విశేషం. కానీ రాహుల్ మాత్రం ఈసారి శ్రీముఖిని నామినేట్ చేశాడు.మొత్తం మీద ఎనిమిదో వారంలో ఎలిమినేషన్ ప్రక్రియలో ఉన్న వారిలో పునర్నవి లేదా శిల్పా చక్రవర్తి బయటకు వెళ్లి పోవచ్చని అప్పుడే సోషల్ మీడియా కోడై కూస్తోంది.