Friday, April 19, 2024
- Advertisement -

ఇద్దరు కంటెస్టెంట్ లను కార్నర్ చేసిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు

- Advertisement -

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 మొదలైన దగ్గర్నుంచి బోలెడు వివాదాలు మరియు గొడవలతో ముందుకు సాగుతోంది. తాజాగా బిగ్ బాస్ మొదలై నాలుగు వారాలు పూర్తయ్యాయి. మొన్న ఆదివారం రోహిణి బిగ్బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయిపోయింది. తాజాగా నిన్న మళ్లీ నామినేషన్ ప్రాసెస్ యధావిధిగా జరిగింది. అయితే దాదాపు ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కేవలం ఇద్దరిని టార్గెట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మిగతా అందరి తో పోలిస్తే బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ మరియు హిమాజ కి ఎక్కువ ఓట్లు గమనార్హం.

రాహుల్ స్నేహితులైన వరుణ్ సందేశ్ మరియు పునర్నవి కూడా సిల్లీ కారణాలు చెప్పి రాహుల్ ని నామినేట్ చేయడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. వీరిద్దరే కాకుండా మహేష్ ఆఖరికి బాబా భాస్కర్ కూడా రాహుల్ ని నామినేట్ చేశారు. రాహుల్, హిమజా లను పక్కనపెడితే హౌస్ లో ఎక్కువ ఓట్లు పడిన మరొక కంటెస్టెంట్ అషు రెడ్డి. టాస్క్ లో సరిగ్గా పాల్గొనడం లేదని, సేఫ్ గేమ్ ఆడుతోంది అంటూ చాలామంది ఆమెని నామినేట్ చేశారు. నామినేషన్ ప్రాసెస్ తరువాత శివ జ్యోతి ఈ వారం కూడా డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి వెళ్ళిపోగా అలీ రెజా బాబా భాస్కర్ ను ఎలిమినేషన్ లోకి పంపించారు. ప్రస్తుతం వోటింగ్ ప్రాసెస్ జరుగుతోంది. మరి నామినేషన్స్ లో ఉన్న వారిలో ఎవరు ఈ వారం బిగ్బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతారో తెలియాలంటే ఈ వారాంతం వరకు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -