Thursday, April 25, 2024
- Advertisement -

బుల్లితెర నటుడు రవికృష్ణకు కరోనా పాజిటివ్..!

- Advertisement -

రోజురోజుకూ కరోనా వైరస్ భారీగా విస్తరిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఎంతో మంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ఇది ఇలా ఉండగా కరోనా వైరస్ బుల్లితెరను వణికిస్తోంది. ఇప్పటికే పలువురు ఈ వైరస్ బారిన పడగా.. తాజాగా బుల్లితెర నటుడు రవికృష్ణ కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల షూటింగ్‌లు మొదలు కావడంతో పలువురు ఈ వ్యాధికి గురవుతున్నారు.

మరీ ముఖ్యంగా తెలుగు బుల్లితెర రంగానికి చెందిన కొందరు నటులు, టెక్నీషియన్లకు కరోనా పాజిటివ్ రావడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఇక, ఈ మధ్య ‘ఆమె కథ’ హీరోయిన్ నవ్య స్వామి కూడా కోవిడ్ బారిన పడ్డారు. బుల్లితెరపై తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రవికృష్ణ తాజాగా మహమ్మారి కరోనా బారిన పడ్డాడు. ఈ విషయంను స్వయంగా ఆయనే వెల్లడించారు. మూడు రోజుల క్రితం చేసిన పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పాడు.

తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘మొన్న జరిగిన టెస్టులో నాకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. మూడు రోజులుగా ఇంట్లోనే ఐసోలేట్ అవుతున్నా. ప్రేక్షకుల అభిమానం… దేవుడి దయ వల్ల నాకు ఎటువంటి లక్షణాలు లేవు. అయితే, నాతో కాంటాక్ట్‌లో ఉన్న వారందరూ టెస్ట్‌లు చేయించుకోండి. అలాగే, ఇంట్లోనే ఉండండి. జాగ్రత్తగా ఉండండి’ అంటూ అతడు రాసుకొచ్చాడు. ‘కరోనా సోకిన వారిని దయచేసి వివక్షతో చూడకండి. అలా చేయడం వల్ల మేము మానసికంగా బలహీనం అయిపోతాము. మాకు మద్దతుగా నిలిస్తే త్వరగా కోలుకుంటాము’ అంటూ అతడు చెప్పుకొచ్చాడు.

టీవీ సీరియల్ నటి నవ్యకు కరోనా..!

బాలకృష్ణ పిలువు వేరే.. అలా అంటే కొట్టేస్తా : నగ్నం హీరోయిన్ కామెంట్స్

శ్యామ్, సాయిసుధ కేసులో సంతకాన్ని మార్ఫింగ్.. కొత్త ట్విస్ట్..!

వర్మ ‘పవర్ స్టార్’ సినిమా హీరో దొరికేశాడు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -