Thursday, April 25, 2024
- Advertisement -

వాళ్ళకి బిగ్ బాస్ లో ఉండే అర్హత లేదంటున్న అషు రెడ్డి

- Advertisement -

నిన్నమొన్నటిదాకా బిగ్ బాస్ త్రీ హౌస్ లో కంటెస్టెంట్ శివ జ్యోతి, రోహిణి మరియు అషు రెడ్డిలతో బాగా క్లోజ్ గా ఉండేది. గత రెండు వారాలలో ఇద్దరు ఎలిమినేట్ అవ్వగా శివ జ్యోతి ఒంటరి పక్షి గా మిగిలిపోయింది. అషు రెడ్డి ఎలిమినేట్ అయినప్పుడు ఎమోషనల్ అయి శివ జ్యోతి బాగా ఏడ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ బయటకు వచ్చి ఎదో ఒక గేమ్ ఆడతారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జున అషు రెడ్డి కి ఒక టాస్క్ ఇచ్చారు.

ఇంట్లో ఉండటానికి అర్హత లేని కొందరు ఇంటి సభ్యుల పేర్లను చెప్పమనగా మహేష్ విట్టా, రాహుల్ సిప్లిగంజ్, వితిక షేరు మరియు హిమాజ అని చెప్పింది అషు. మిగతా వారు అందరూ చాలా స్ట్రాంగ్ అని చెప్పిన అషు రెడ్డి ఇంటి నుంచి వెళ్లిపోయేటప్పుడు కన్నీళ్లతో బయటకు వచ్చేసింది. ఇంతకాలం బిగ్బాస్ జర్నీ చేసినందుకు నాగార్జున ఆమెను మెచ్చుకున్నారు. ఇక ఈ మధ్యనే బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసిన అషు రెడ్డి గత వారం ఎలిమినేట్ అయిన రోహిణితో కలిసి సోషల్ మీడియాలో పలు ఫోటోలను కూడా పెట్టింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -