Thursday, April 18, 2024
- Advertisement -

ముగ్గురికి ఇమ్మ్యూనిటి ఇచ్చి నామినేషన్స్ నుండి తప్పించిన బిగ్ బాస్

- Advertisement -

బిగ్ బాస్ సీజన్ త్రీ లో సోమవారం నాడు జరిగిన ఎపిసోడ్లో ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. వారు రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, రవి కృష్ణ, మహేష్, పునర్నవి మరియు హిమజ. అయితే నిన్న ఎపిసోడ్ లో బిగ్ బాస్ వారికి ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఆరుగురిలో ఎవరో ఒక ముగ్గురిని మరొక ముగ్గురి కోసం త్యాగం చేసి కేవలం ముగ్గురు మాత్రమే నామినేషన్స్ లో ఉండే లాగా పేర్లు చెప్పమన్నారు. ఈ నేపథ్యంలో మహేష్ హిమజ మరియు పునర్నవి లు నామినేషన్ కి వెళ్లిపోగా రవికృష్ణ, రాహుల్ మరియు వరుణ్ కు బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు.

అందులో భాగంగా కొన్ని టాస్క్ లు ఇచ్చి అందులో రెండిటిని సెలక్ట్ చేసుకుని వాటిని కంప్లీట్ చేస్తే వారికి ఈసారి నామినేషన్స్ కి వెళ్ళకుండా ఇమ్మ్యూనిటి వస్తుందని బిగ్బాస్ చెప్పారు. ఈ నేపథ్యంలో రాహుల్, రవి మరియు వరుణ్ లు రెండు రెండు టాస్క్ లు తీసుకుని పూర్తి చేసి నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు. అందులో భాగంగా ఇంటి సభ్యులలో ఒకరికి ఇష్టమైన బట్టలన్నీ కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించడం, ముఖం మీద చల్లని కాఫీ విసరడం, బెడ్ మొత్తం నీటితో తడపడం వంటివి విజయవంతంగా పూర్తి చేశారు. ఈ వారం మహేష్, హిమాజ, పునర్నవి లను మాత్రమే నామినేషన్స్ లో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -