బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్ళారు. ఆయన డిప్రెషన్ లో ఉన్నాడని అందుకే సూసైడ్ చేసుకున్నారని కొందరు అంటూన్నారు. అయితే ఆయన మరణంపై అసలు విషయం ఇంకా తెలియలేదు. అయితే ఇందులో ప్రధానమైనది.. ఆర్ధిక ఇబ్బందుల వల్ల సుశాంత్ చనిపోయి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ఎంత ఆస్తి ఉందో ఒకసారి చూద్దాం. సుశాంత్ మంచి హీరో మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా.
ఆయన ఒక్క సినిమాలో నటిస్తే రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇక యాడ్స్ చేస్తే కోటి వరకు తీసుకుంటారు. ఆయన నటించిన ధోనీ మూవీ 220 కోట్ల వరకు వసూళ్లు చేసింది. సుశాంత్ సినిమాలు, యాడ్స్ ద్వారా సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్ సహా పలు చోట్లు ఇన్వెస్ట్ చేసే వారు. సుశాంత్ కు చాలా కార్లు, బైకులు ఉన్నాయి. ల్యాండ్ రోవర్, మాసెరటి క్వార్టర్పోర్ట్ (దీని ధర రూ.1.5 కోట్లు), బీఎండబ్ల్యూ 1300ఆర్ బైక్ (రూ.25 లక్షలు) సహా పలు ఇతర కార్లు ఉండేవి.
బాలీవుడ్ లో హీరోగా రాకముందు సుశాంత్ టీవీ షోలో చేసేవాడు. సుశాంగ్ సింగ్ సంపద విలువ దాదాపు రూ.60 కోట్ల వరకు ఉండొచ్చు. అయితే సుశాంత్ కు అంతరిక్షం అంటే చాలా ఇష్టం. అందుకే చంద్రుడిపైన ప్లాట్ కొనుగోలు చేశారు. మూన్ పై ప్లాట్ కొనుగోలు చేసిన మొదటి బాలీవుడ్ యాక్టర్ సుశాంత్. సీ ఆఫ్ మాస్కోవీలో ఈయన ప్లాట్ ఉంది. సుశాంత్ 14ఎల్ఎక్స్00 అనే పవర్ఫుల్ టెలీస్కోప్తో ఆయన ప్లాట్ను చూసేశారు. ఇంటర్నేషనల్ లూనర్ ల్యాండ్స్ రిజిస్ట్రీ ద్వారా సుశాంత్ ఈ ల్యాండ్ కొనుగోలు చేశారు.
మీరా చోప్రాకు కౌంటర్ ఇస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మద్దతు ఇచ్చిన ఖుష్బూ..!
ఎక్స్పోజింగ్ అనోసరంగా చేశానేమో : యుమనా