Saturday, April 20, 2024
- Advertisement -

ఆగస్టు 2 పోటీ లో నిలిచేదెవరు?

- Advertisement -

ఒకే రోజున రెండు మూడు మంచి బజ్ ఉన్న సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే అటు ట్రేడ్ వర్గాలకి, అభిమానులకి, ప్రేక్షకులకి, విమర్శకులకు, నిర్మాతలకి, ఇలా అందరికీ కష్టం గా నే ఉంటుంది. ముందుగా థియేటర్ల ని సంపాదించుకోవడం తో పనంతా అయిపోతుంది. కొంచెం టాక్ అటూ ఇటూ ఉండి, పక్క సినిమా కి మంచి టాక్ వస్తే ఇక మన సినిమా ని పట్టించుకొనే వారు ఉండరు అని అందరూ నిర్మాతలకి తెలుసు. కాకపోతే ఇప్పుడు తాజాగా వచ్చే నెల 2 న మూడు పాజిటివ్ బజ్ ఉన్న సినిమాలు విడుదల కానున్నాయి. అయితే ఆ రోజున నిజానికి ఎవరు బరిలో నిలుస్తారు, ఎవరు వెనుకంజ వేస్తారు అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేకుండా పోయింది.

శర్వానంద్ హీరో గా రణరంగం సినిమా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రాక్షసుడు సినిమా, కార్తికేయ హీరో గా గుణ 369 సినిమాలు ఒకే రోజున విడుదల కానున్నాయి. అయితే ఆసక్తికరం అంశం ఏంటి అంటే ఇందులో రాక్షసుడు సినిమా ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. మరల డేట్ పోగొట్టుకునే ఛాన్స్ లేదు. శర్వానంద్ సినిమా కి పెద్ద ఎత్తున అంచనాలు ఉంటాయి కాబట్టి, డేట్ మిస్ కొట్టే అవకాశం లేదు. అయినప్పటికీ గుణ కూడా అదే రోజున వస్తాడా లేక ఏమైనా అడ్జెస్ట్మెంట్స్ ఉంటాయా అనేది వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -