Friday, March 29, 2024
- Advertisement -

బ్రోచేవారెవరురా ని బ్రోచేదెవరు?

- Advertisement -

ఈ మధ్య విడుదల అయిన చాలా సినిమాల లో బ్రోచేవారెవరురా అనే చిత్రం మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించింది అని చెప్పుకోవచ్చు. శ్రీవిష్ణు, నివేత థామస్, నివేత పెత్తురాజ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ,సత్యదేవ్ నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. మెంటల్ మదిలో అనే సినిమా ని దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమా కి దర్శకుడు. ఈ సినిమా కి విడుదల అయిన తోలి రోజే మంచి పేరు వచ్చింది. సినిమా కి ఒక్క సారిగా పాజిటివ్ టాక్ రావడం తో చిత్ర యూనిట్ చాలా సంతోషించారు. ఇకపోతే ఈ సినిమా కి ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి, సినిమా పరిశ్రమ లో ని పెద్దల నుండి మంచి అప్రిసియేషన్ వచ్చింది అని చెప్పొచ్చు.

అయితే ఈ సినిమాకు ఇంకా శాటిలైట్ డీల్ పూర్తికాలేదని తెలుస్తోంది. సినిమా నిర్మాతలు ఎక్కువ మొత్తం అడుగుతుండటం ఎవరూ ముందుకు రావడం లేదు అని తెలుస్తుంది. యాభై లక్షల కి పైగా డబ్బుల ని నిర్మాతలు ఆశిస్తున్నారు అని తెలుస్తుంది. అయితే ఇంకా ఆలస్యం చేస్తే సినిమా మీద ఉన్న బజ్ పడిపోతుంది కాబట్టి త్వరగా రైట్స్ ని అమ్మేయాలి అనే ప్లాన్ లో ఉన్నారు నిర్మాతలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -