Wednesday, April 24, 2024
- Advertisement -

వర్మపై కేసు.. ఎవరు పెట్టారంటే ?

- Advertisement -

రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన సంచలనమే అవుతుంది. అతను వివాదాలకు చాలా దగ్గరగా ఉంటారు. ఏ సినిమా చేసిన అది రిలీజ్ అయ్యేవరకు ఏదో ఒకటి చేస్తూ గట్టిగానే ప్రమోషన్స్ చేస్తాడు. ఇప్పుడు మరోసారి తనదైన శైలిలో ఇంకో వివాదానికి తెరతీశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని తెరకెక్కించి టీడీపీ నేతల్లో గుబులు పుట్టించిన వర్మ.. ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటు మరో వివాదాస్పద చిత్రంను తెరకెక్కించాడు.

గత ఎన్నికల్లో టీడీపీ ఘోర పరజయం.. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమాలో కాంట్రవర్సీ లేదంటూనే.. సినీ రాజకీయాల్లో గుబులు పుట్టిస్తున్నాడు వర్మ. ఈ క్రమంలో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ సినిమాపై అనంతపురంలోని కొందరు కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కులాల మధ్య గొడవలు సృష్టించేదిగా ఈ చిత్రం ఉందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా టైటిల్ ను వెంటనే రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఇక ఈ సినిమా విషయంకు వస్తే.. టైటిల్ తోనే భారీ అంచనాలు పెంచేశాడు.

దీపావళి కానుకగా ట్రైలర్ రిలీజ్ చేసి పెద్ద బాంబే పేల్చాడు. ఈ సినిమాలో జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పోలీన పాత్రలతో ట్రైలర్ ను రిలీజ్ చేయడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. మరీకెన్ని వివాదాలు ఈ సినిమాపై వస్తాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -