Thursday, April 18, 2024
- Advertisement -

ఇది నితిన్ కి తగునా?

- Advertisement -

వరుస ఫ్లాప్ సినిమాలతో ఇక కొత్తగా ఏం చేయాలా అని ఆలోచిస్తున్న నితిన్ కి ఒక మంచి కథ చెప్పి సినిమా కన్ఫర్మ్ చేయించుకున్నాడు వెంకీ కుడుములు. చలో సినిమా తో దర్శకుడి గా సినిమా పరిశ్రమ లో అడుగు పెట్టిన వెంకీ తన తదుపరి చిత్రాన్ని నితిన్ తో చేయనున్నాడు. ఎప్పటి నుండో ఈ సినిమా కి సంబందించిన వార్తలు మీడియా లో వస్తున్నా కేవలం ఇటీవలే ఈ చిత్రాన్ని దర్శక నిర్మాతలు అధికారికం గా ప్రకటించారు. భీష్మ అనే టైటిల్ తో మన ముందుకు రానున్న ఈ సినిమా లో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ ఈ పాటికి మొదలు కావలి. స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ కూడా ముగించుకొని నితిన్ కోసం ఎదురు చూస్తున్నాడు దర్శకుడు. కొన్ని అనుకోని కారణాల వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనే విషయం మీద దర్శకుడికి కూడా క్లారిటీ లేదు. అంతా నితిన్ చేతిలో నే ఉంది అని అందరూ అంటున్నారు. అయితే ఇన్ని రోజులు దర్శకుడిని వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు అని నితిన్ కూడా హింట్స్ అందుతున్నాయట. ఇంకా ఎక్కువ సమయం వృధా చేయకుండా సినిమా ని త్వరగా మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు హీరో.

సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద సూర్య దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -