Wednesday, April 24, 2024
- Advertisement -

డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా ఛార్మి…

- Advertisement -

ఛార్మి కౌర్ ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ లో దాదాపు అందరు స్టార్ హీరోస్ తో పని చేసిన నటి. మెల్ల మెల్లగా సినిమాలకి దూరం అయ్యి ఆ పై నిర్మాణ రంగం లో అడుగు పెట్టి ప్రస్తుతం నిర్మాత గా తన కెరీర్ నీ బిల్డ్ చేసుకుంటుంది. పురి జగన్నాథ్ తో బిజినెస్స్ పార్టనర్ గా ఉంటూ పురి జగన్నాథ్ చేసే అన్ని సినిమాలకి నిర్మాత గా వ్యవహరిస్తుంది ఛార్మి.

ఇటీవల కాలంలో లో ఛార్మి కౌర్ డ్రగ్స్ కేసు లో చిక్కుకొని స్పెషల్ ఇన్వెష్టఐగేషన్ టీం యొక్క ఇన్వెస్టిగేషన్ కి కూడా హాజరు అయింది. తన 31వ జన్మ దిన సందర్భంగా మీడియా తో ముచ్చటించారు ఛార్మి. ఈ విషయం పై కూడా స్పందిస్తూ ఆవిడ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న అప్పుడు జరిగిన పరిణామాల గురించి ఛార్మి స్పందిస్తూ, తాను ఆ టైమ్ లో చాలా బాధ లో కురుకు పోయాను అని చెప్పింది. ఆ సమయం లో అవమానం వల్ల డిప్రెషన్ లోకి వెళ్లినట్టు కూడా చెప్పింది. తన పరిస్థితి ని చూసి తన తల్లిదండ్రులు కూడా చాలా బాధ పడ్డారు అని చెప్పి డ్రగ్స్ కేసులో నుండి క్లీన్ చిట్ తో బయటకు రావడం ఊరట నిచ్చింది అని తెలిపింది.

ఛార్మి ప్రస్తుతం పురి జగన్నాథ్ తో కలిసి ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా ని నిర్మిస్తోంది. ఈ సినిమా లో రామ్, నభ నటేశ్ మరియు నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -