- Advertisement -
లోక్సభ ఎన్నికల వేళ తమిళనాడులోని అన్ని పార్టీల్లో చేరికలు కొనసాగుతున్నాయి. కమల్హాసన్ పార్టీ ‘మక్కల్ నీధి మయ్యం’లో ఇవాళ ప్రముఖ హాస్య నటి కోవై సరళ చేరారు. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కోవై సరళను కమల్ పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో కమల్కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు. కోవై సరళకు పార్టీ సభ్యత్వాన్ని అందించిన కమల్ హాసన్ ఆమె సేవలు అవసరమని అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్దమవుతున్న కమల్ హాసన్కు కోవై సరళ పార్టీలో చేరిక కోయంబత్తూరు పరిసర కొంగునాడు ప్రాంతంలో కొంత బలాన్నిస్తుంది .