Thursday, April 25, 2024
- Advertisement -

కాజల్ తో మరోసారి అంటున్న చిరంజీవి?

- Advertisement -

భరత్ అనే నేను సినిమా తర్వాత కొరటాల శివ మరో సినిమా జోలికి వెళ్ళలేదు. మెగా స్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రం శివ తో చేస్తాను అనే మాట ఇవ్వడం తో తన సమయం మొత్తం ఈ సినిమా స్క్రిప్ట్ ని తయారు చేయడం లో వెచ్చించాడు శివ. అయితే ఈ సినిమా కొంచెం ఆలస్యం అవుతూ రాగా,శివ మాత్రం సమయం వృధా చేయకుండా స్క్రిప్ట్ కి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుతూ వచ్చాడు. చిరంజీవి సైడ్ నుంచి సై రా షూటింగ్, డబ్బింగ్ రెండూ పూర్తయ్యాయట.

ఇక చిరంజీవి మరో రెండు నెలల్లో కొత్త చిత్రం ప్రారంభం చేయనున్నాడు. కొరటాల శివ దర్శకత్వం లో ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమా చేయనున్నాడు చిరు. ఈ సినిమా లో చిరంజీవి రైతు గా చేయనున్నాడు అని, ద్విపాత్రాభినయం చేయనున్నాడు అని కొందరు పుకార్లు సృష్టిస్తున్న, ఏది నిజం అనే విషయం లో మాత్రం ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు.

అయితే తాజా ఫిలిం నగర్ సమాచారం మేరకు ఈ సినిమా లో కాజల్ ని హీరోయిన్ గా తీసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ముందుగా శృతి హాసన్, ఐశ్వర్య రాయ్, శ్రద్ధ శ్రీనాథ్, నయనతార ని అనుకున్నా చివరికి కాజల్ ఖైదీ నంబర్ 150 తర్వాత మళ్ళీ చిరంజీవి తో నటించే అవకాశం దక్కించుకుంది అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -