Thursday, April 18, 2024
- Advertisement -

చిరంజీవి తో విజయశాంతి.. ఫ్యాన్స్ కు పండుగ

- Advertisement -

ఒకరేమో మెగాస్టార్.. మరొకరేమో లేడీ సూపర్ స్టార్. టాలీవుడ్ లో ఈ జంట నుంచి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయి. ఆ కాలంలో తెలుగు తెరపై ఎవర్ గ్రీన్ జంట అయిన చిరంజీవి-విజయశాంతి కాంబేనేషన్ మరోసారి తెలుగు అభిమానులను కనువిందు చేయడానికి వస్తోంది. ఫ్యాన్స్ పండుగ చేసుకునే ఈ వార్త తాజాగా బయటకు వచ్చింది.

చిరంజీవి-విజయశాంతిది హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి పసివాడి ప్రాణం, కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్ లాంటి బ్లాక్ బస్టర్స్ చిత్రాల్లో నటించారు.అయితే ఆ తర్వాత విజయశాంతి సినిమాలకు దూరమయ్యారు.

అయితే తాజాగా 13 ఏళ్లకు మహేష్ బాబు ‘సరిలేరు మీకెవ్వరు చిత్రంతో మళ్లీ టాలీవుడ్ తెరపైకి వస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా చిరంజీవి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ల తర్వాత చిరంజీవి, విజయశాంతి, మహేష్ బాబులను ఒకే వేదికపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత కనిపిస్తున్న ఈ జోడీ టాలీవుడ్ ఆసక్తి రేపుతోంది. తాజాగా విజయశాంతి తన అఫీషియల్ ఖాతాలో ఈ ప్రిలీజ్ వేడుక సందర్భంగా మెగా, సూపర్ ఫెస్టివల్ చూడబోతున్నారంటూ ట్వీట్ చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -