Thursday, March 28, 2024
- Advertisement -

ఆఖరి మజిలీ కి చేరుకున్న చిరంజీవి

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం తన డ్రీం ప్రాజెక్ట్ సై రా నరసింహా రెడ్డి మీద పని చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు. నయనతార, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, మరి కొంత మంది ఈ సినిమా లో ముఖ్య పాత్రలు పోషించారు. ఇకపోతే చిరంజీవి ఎప్పటి నుంచో ఈ సినిమా చేయాలని అనుకున్నాడు, చివరికి రామ్ చరణ్ సారథ్యం లో ఈ సినిమా పూర్తి కావొస్తుంది. ఇప్పటికే సినిమా లో చిరంజీవి కి సంబందించిన సీన్లని మేకర్స్ పూర్తి చేయగా, మిగిలిన నటుల షూటింగ్ జరుగుతుంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న చిరంజీవి ప్రస్తుతం డబ్బింగ్ పనుల తో బిజీ గా ఉన్నారు. ఇక చిరంజీవి తరపున నుంచి డబ్బింగ్ ఒకటే పెండింగ్ ఉంది. మెల్ల మెల్లగా మిగిలిన నటులు కూడా డబ్బింగ్ చెప్పడానికి రానున్నారు. ఈ డబ్బింగ్ పూర్తి అయితే ఇక నిర్మాణాంతర కార్యక్రమాలు వేగవంతం అవుతాయి. అన్నీ అనుకున్నట్లు గా జరిగితే ఈ సినిమా ని ఎట్టి పరిస్థుల్లో దసరా పండుగ కి విడుదల చేయాలి అని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -