Friday, April 19, 2024
- Advertisement -

చిరంజీవి ఆ టాప్ హీరో తో తలపడుతున్నాడా.. ?

- Advertisement -

చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు పరాజయం అన్నది తెలియని కొరటాల శివ ఈ సినిమా కి దర్శకుడు.. ఇక ఈ సినిమా కథ కాపీ అంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కొంత ఈ సినిమా నిర్మాణానికి అడ్డంకి గా మారగా ఆ సమస్య ఇప్పుడు ముగిసిపోయిందని చెప్తున్నారు.. త్వరలో ఈ సినిమా షూటింగ్ కి వెళ్లనుంది.. సంక్రాంతి కి రిలీజ్ చేసే ఆలోచనలో ఈ సినిమా ఉన్నట్లు తెలుస్తుంది.. ఇక ఈ సినిమా తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో చిరు సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది..

మొదట్లో సుజిత్ దర్శకత్వం వహిస్తాడని వార్తలు రాగ స్క్రిప్ట్ విషయంలో సంతృప్తిగా లేని వినాయక్ కు ఛాన్స్ ఇచ్చారని తెలుస్తుంది.. ఇక ఇది మలయాళ రీమేక్ సినిమా అని అందరికి తెలిసిందే.. అక్కడ సూపర్ హిట్ అయిన లూసిఫర్ కి ఈ సినిమా రీమేక్.. ఇప్పటికే ఈ సినిమా కి తగ్గ పనులు పూర్తయ్యాయి.  మెగాస్టార్ సూచనలు, ఇన్ పుట్స్ కు అనుగుణంగా, లూసిఫర్ ను చాలా వరకు మార్చి తయారుచేసినట్లు తెలుస్తోంది.దర్శకుడు ఈ మధ్యనే రెండు రోజులు బెంగళూరులో మెగాస్టార్ ను కలిసి, ఫుల్ అండ్ ఫైనల్ నెరేషన్ ఇచ్చి వచ్చారు. దాంతో ఈ సినిమా కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి..

ఆచార్య సినిమా తర్వాత ఇది ఉంటుందని తెలుస్తుంది.. మరోవైపు బాబీ, మెహర్ రమేష్ లకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, లూసిఫర్ సెట్ మీదకు 2021 సమ్మర్ వేళకు మెగాస్టార్ వచ్చే అవకాశం వుంది. ఎప్పటి లాగే కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ తో కలిసి ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తారు. ఇక వినాయక్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా తో వారు హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుండగా ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -