Friday, April 19, 2024
- Advertisement -

రోజా పక్కన ఆయన లేని లోటు

- Advertisement -

జబర్దస్త్ తెలుగు బుల్లి తెర పై పాపులారిటీ సంపాదించుకున్న టీవీ షో. ఇప్పటి వరకు ఈ టీవీ షో ని రేటింగ్స్ లో కంపీట్ చేయగల ఇంక ఏ టీవీ షో కూడా తెలుగు లో వచ్చింది లేదు. అయితే ఈ షో మొదలు అయినప్పటి నుండి నాగ బాబు మరియు రోజా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న విషయం మనకి తెలిసిందే. ఇటీవల ఎన్నికల సమయం లో ఇటు రోజా అటు నాగ బాబు ఇద్దరు తమ తమ పొలిటికల్ పనుల వల్ల షో కి దూరమైన విషయం మనం గమనించాం.

వారిద్దరి స్థానం లో షో నిర్వాహకులు వేరే మీనా, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, సంఘవి వంటి వారిని షో లోకి ఆహ్వానించిన విషయం విదితమే. అయితే ఇప్పుడు రోజా షో లో జాయిన్ కాగా నాగ బాబు తిరిగి రావడానికి మరింత సమయం పట్టేలా ఉంది అని తెలుస్తుంది. నిర్వాహకులు ఆల్రెడీ ఈటీవీ తో పని చేస్తున్న ఆలి ని ఈ షో లోకి తీసుకున్న విషయం మనకు తెలిసిందే.

అయితే నాగబాబు-రోజా లేని షో ఎందుకో రుచించడం లేదు అని జనాలు భావిస్తున్నారట. వీలైనంత త్వరగా నాగ బాబు ని తిరిగి షో లో కి తీసుకోవాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -