Tuesday, April 23, 2024
- Advertisement -

అసలు ఆ సినిమాలో నే నేను లేను: స్టార్ కమెడియన్

- Advertisement -

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వo లో ఈ సినిమా రానుంది. అయితే ఈ రోజు ఈ సినిమా గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. సినిమా లో ఒక కామెడీ పాత్ర కోసం పృథ్వీ ని తీసుకుందాం అని త్రివిక్రమ్ అనుకుంటుంటే, అతను మెగా ఫ్యామిలీ కి వ్యతిరేకం గా కామెంట్స్ చేసాడు అని, అలాంటి అతనికి సినిమా లో అవకాశం ఇవ్వదు అని అల్లు అర్జున్ చెప్పాడని కొంత మంది పుకార్లు సృష్టించిన నేపథ్యం లో పృథ్వీ ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు.

“అసలు ఈ సినిమా లో నాకు అవకాశం ఎవరు ఇచ్చారో నాకు తెలియదు. వాళ్ళెవరూ నన్ను అప్రోచ్ అయింది లేదు. అలాంటప్పుడు ఇలా తప్పుడు ప్రచారం ఎలా చేయగలరు. ఇలా పుకార్లు పుట్టించడం కరెక్ట్ కాదు. నాకు మెగా ఫ్యామిలీ పైన ఎనలేని గౌరవం ఉంది. మేము రాజకీయ పరం గా విభేదించుకోవచ్చు కానీ ఇలా కారణం చూపెట్టి మా ఆర్టిస్ట్స్ ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. నేను అత్తారింటికి దారేది సినిమా తర్వాత త్రివిక్రమ్ గారిని కలిసిందే లేదు. ఆయన ఈ సినిమా కోసం నన్ను పిలవనూ లేదు. ఇక మీడియా లో వస్తున్న వార్తల్లో నిజం లేదు.” అని పృథ్వి క్లారిటీ ఇచ్చారు.

ఇకనైనా ఈ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -