Thursday, April 25, 2024
- Advertisement -

కిడ్నీ చికిత్స కోసం అమెరికా బయల్దేరిన రానా

- Advertisement -

గత కొన్ని నెలలుగా హీరో రానా ఆరోగ్యం గురించి అనేకానేక వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నేటి వరకు రానా ఈ విషయమై ఏమి ప్రత్యేకంగా మాట్లాడినట్టు లేదు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం రానా కిడ్నీ సంబంధిత వ్యాధి తో బాధ పడుతున్నాడట. అది కూడా ఈ మధ్య క్షీణించసాగిందట.

అయితే వెంటనే అత్యవసరం గా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితి రావడం తో ఇప్పుడు రానా అమెరికా బయల్దేరి వెళ్ళాడట. నిన్న మొన్నటి వరకు రానా ట్రీట్మెంట్ ని హైదరాబాద్ మరియు ముంబై నగరాల్లో చేయించుకుంటున్నాడు కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం క్షీణించడం తో తన తల్లి రానాని వెంటనే అమెరికా తీసుకొని వెళ్లిందని సమాచారం. అమెరికా లో పేరుగాంచిన నెఫ్రాలజిస్ట్ ని సంప్రదించి రానా అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోనున్నట్లు తెలుస్తుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలా లేక నార్మల్ గా నే సెట్ అవుతుందా అనే అంశం మీద చర్చలు సాగుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

ప్రస్తుతం రానా విరాట పర్వం అనే సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా కి వేణు ఉడుగుల దర్శకుడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -