Friday, April 19, 2024
- Advertisement -

రానా ‘అరణ్య’ కి ఏమైంది.. ?

- Advertisement -

బాహుబలి సినిమా తో దేశవ్యాప్తంగా మారుమోగిపోయిన పేరు రానా దగ్గుబాటి.. ఈ సినిమా తో తన స్టామినా తెలియజేయడమే కాదు హీరో గా కూడా నిలదొక్కుకోవడానికి రానా కి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడింది.. బాహుబలి కంటే ముందే రానా కు పలుభాషల్లో మంచి పరిచయముంది.. అంతకుముందే రానా తమిళ, హిందీ సినిమాల్లో మెరిసి ప్రేక్షకులను మురిపించాడు.. అయితే అది అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేదని చెప్పాలి.. ఓ సాదా సీదా నటుడిగా మాత్రమే పరిచయమైనా రానా బాహుబలి తో ఇతను మాములు నటుడు ఏం కాదని మాత్రం చెప్పేశాడు.. బాహుబలి తర్వాత రానా చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది.. నేనే రాజు నేనే మంత్రి సినిమా అయితే టాలీవుడ్ రికార్డులు తిరగరాసింది అని చెప్పాలి..

ఇక ప్రస్తుతం రానా పాన్ ఇండియా మూవీ అరణ్య మూవీ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కి సంబందించి టీజర్ ని కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేసి సినిమా పై మంచి అంచనాలను ఏర్పరిచేలా ప్లాన్ చేశారు.. కానీ కరోనా అన్ని సినిమాలపై ప్రభావం చూపించినట్లుగా ఈ సినిమా పై కూడా గట్టి ప్రభావం చూపించింది. ఈ ఏడాది ఏప్రిల్ 2 తారీకున దేశ వ్యాప్తంగా ఒకే సారి విడుదల చేయాలనుకున్నారు. కాని కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా విడుదల ఆగిపోయింది.

అయితే విడుదల చివరి నిమిషంలో ఆగిపోయిన సినిమాలు ఇన్ని రోజులు థియేటర్ల ఓనెన్ కోసం వెయిట్ చేసి ఇప్పట్లో ఆ అవకాశం లేదనే నిర్ణయానికి వచ్చి మెల్లగా ఓటీటీ దారి పడుతున్నారు. కొన్ని సినిమాలు చివరి దశలో ఉండగా వాటిని కూడా పూర్తి చేసి ఓటీటీకి ఇస్తున్నారు. కాని రానా ‘అరణ్య’ సినిమాను మాత్రం ఓటీటీకి ఇచ్చేందుకు సిద్దంగా లేరని తెలుస్తోంది. అందుకు కారణం దేశవ్యాప్తంగా మార్కెట్ ఉన్న రానా సినిమా ను ఇలా OTT లో రిలీజ్ చేసి తన స్టార్ డం ని తగ్గించడం ఏమాత్రం ఇష్టం లేదని మేకర్స్ అంటున్నారట.. సల్మాన్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రానా అడవి మనిషి గా కనిపించబోతున్నాడు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ లతో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -