ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది పార్టీలు మారే నేతలు ఎక్కువ అవుతున్నారు. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మకంతో చాలామంది ఆ పార్టీలో వస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ టీడీపీ పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు ఎక్కువుతున్నాయి. ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు, ఒక ఎంపీ కూడా వైసీపీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీకి పలువురు సినీ ఇండస్ట్రీ నుంచి తమ మద్దతు తెలుతున్నారు. ఇప్పటికే చాలామంది నటీ,నటులు వైసీపీకి జై కొట్టగా , ఇప్పుడు మరో నటుడు వైసీపీకి తన మద్దతు తెలుపుతున్నాడు. తెలుగు ఇండస్ట్రీ గురువుగా భావించే దాసరి నారయణరావు కొడుకు దాసరి అరుణ్ వైసీపీలోకి చేరుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
దాసరి అరుణ్ను పార్టీలోకి తీసుకురావడంలో కమెడియన్ పృద్వీ కీలక పాత్ర పోషించినట్లుగా సమాచారం. దాసరి అరుణ్ త్వరలోనే వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. గతంలో జగన్ కూడా దాసరి నారయణ రావుని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. కాని పార్టీలో చేరేలోపే ఆయన మరణించడం జరిగింది. ఇప్పుడు ఆయన కొడుకు అరుణ్ని పార్టీలోకి తీసుకురావడంలో వైసీపీ సక్సెస్ అయింది.. ఉభయగోదావరి జిల్లాలో దాసరి నారాయణ రావుకు పట్టు ఉందని ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉందని తెలుస్తోంది. తద్వారా ఆయన కొడుకు చేత ప్రచారం చేయిస్తే కాపు ఓట్లు పార్టీకి పడే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది. మరి దాసరి కొడుకుని పార్టీలో చేరుకోవడం ద్వారా వైసీపీ ఎంత మేర విజయం సాధిస్తుందో చూడాలి.
- Advertisement -
వైసీపీలోకి దాసరి కొడుకు
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -