టాలీవుడ్ టాప్ హీరోలలో కింగ్ నాగర్జున, నటసింహాం బాలకృష్ణలు కూడ ఒకరు. చాలాకాలం తరువాత వీరిద్దరు ఒకే వేదికపై కనిపించారు. పొలిటీషియన్ , కళాబంధు టీఎస్సార్ జాతీయ అవార్డుల ప్రధానోత్సవంలో వీరిద్దరు ఒకే వేదికపై కనిపించారు.వీరిద్దరు కనిపిచండంలో పెద్ద వింత ఏముంది అనే కదా మీ అనుమానం. గత కొంతకాలం నుంచి బాలయ్యతో నాగ్కు మాటలు లేవని వార్తలు వచ్చాయి దీనికి తగినట్లుగానే అటు బాలయ్య. ఇటు నాగ్ కూడా ఏ సినిమా ఫంక్షన్లో కనిపించలేదు. దీంతో చాలామంది ఇది నిజమే అనుకున్నారు. ఇండస్ట్రీలోని ఓ వర్గం కూడా బాలయ్య, నాగ్కు మధ్య సరైన సంబంధాలు లేవని తెలిపారు. ఇది నిజమే కాబోలు అనుకున్నారు.
తాజాగా ఈ వార్తలు ఊట్టి రూమర్స్ అని రుజువు చేశారు బాలయ్య, నాగ్.టీఎస్సార్ జాతీయ అవార్డుల ప్రధానోత్సవంలో కలిసి కనిపించడంతో పాటు, ఒకరి పక్కన మరోకరు కూర్చోని మరి అప్యాయంగా మాట్లాడుకున్నారు.ఆదివారం సాయంత్రం బీచ్ సొగసుల విశాఖ నగరంలో జరిగిన టీఎస్సార్ -టీవీ 9 జాతీయ అవార్డుల వేదికపై ఈ దృశ్యం కన్నులపండుగ చేసింది. 2017-18 సీజన్ కి వరుసగా రెండేళ్లకు కలిపి ఈ అవార్డుల్ని అందించారు. ఈ ఫంక్షన్కు నాగ్ , బాలయ్యలతో పాటు మెగాస్టార్ చిరంజీవి , కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా హాజరైయ్యారు.
- Advertisement -
బాలయ్య- నాగ్ల మధ్య గొడవలు సర్ధుమణిగాయా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -