Saturday, April 20, 2024
- Advertisement -

‘మా’లో అప్పుడే లుక‌లుక‌లు..?

- Advertisement -

సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మాత్రం తీసిపోకుండా ‘తెలుగు మూవీ ఆర్టిస్ట్’ ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి అంద‌రికి తెలిసిన విష‌య‌మే. ఈ ఎన్నిక‌ల్లో ‘మా’ అధ్య‌క్షుడిగా శివాజీ రాజా, న‌రేష్‌లు పోటీ ప‌డ్డారు. గ‌తంలో ఎన్న‌డు లేని విధాంగా అత్య‌ధికంగా పోలీంగ్ ఈ ఎన్నిక‌ల్లో జ‌రిగింది. ఈ ఎన్నిక‌ల్లో శివాజీ రాజాపై న‌రేశ్ సూమారు 75 ఓట్ల తేడాతో విజ‌యం సాధించాడు. న‌రేశ్‌తో పాటు అత‌ని ప్యానెల్ కూడా ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించింది. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది ,కాని మా అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ‌స్వీక‌రం రోజునే ‘మా’ లుక‌లుక‌లు బ‌య‌డ‌ప‌డ్డాయి. తాజాగా మ‌రోసారి మూవీ ఆర్టిస్ట్‌లోని లోపాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

‘మా’ సభ్యుల కోసం ఖర్చు చేయాల్సిన ఏడున్నర లక్షల మొత్తాన్ని జీవిత రాజశేఖర్ కుమార్తె ఖాతాలోకి వెళ్లిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ‘మా’లోని డ‌బ్బు జీవిత రాజశేఖర్ కుమార్తె వెళ్ల‌డం ఎంట‌ని చాలామంది ప్ర‌శ్నిస్తున్నారు. అయితే దీనిపై ‘మా’ వాద‌న మ‌రోలా ఉంది. తెలంగాణా ప్రభుత్వ పథకాలను పొగుడుతూ కొన్ని ప్రకటనలు చేయించి కానుకగా ఇద్దామని అనుకున్నారు. దానికోసం ఏడున్నర లక్షలు ఖర్చు చేసేశారు. దాని కోస‌మే జీవిత రాజశేఖర్ కుమార్తె అకౌంట్లో డ‌బ్బులు బ‌దీలి చేశార‌ని అంటున్నారు. సభ్యుల సంక్షేమం కోసం వాడాల్సిన డబ్బుని ఇలా వేరే పనులకు వాడడంపై ఎంట‌ని ‘మా’లోని స‌భ్యులు మా అధ్య‌క్షుడిని ప్ర‌శ్నిస్తున్నార‌ట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -