Friday, April 19, 2024
- Advertisement -

అల్లు అర్జున్ కు షాకివ్వబోతున్న దిల్ రాజ్

- Advertisement -

ఈ సంక్రాంతి బరి ఆసక్తి రేపుతోంది. రోజు విడిచి రోజు పరిధిలో బరిలోకి దిగుతూ మహేష్ బాబు, అల్లు అర్జున్ కాకరేపుతున్నారు. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేస్తే కలెక్షన్లపై ప్రభావం పడుతుంది. అందుకే గ్యాప్ పాటించాలని చెబుతున్నా హీరోలు ఇగోకు పోయి ఒకే రోజున విడుదల చేసేందుకు మొదట సై అన్నారు. నిర్మాతల మండలి, పెద్దల జోక్యంతో ఒకరోజు ముందుకు వెనక్కు జరిగారు.

తాజాగా నిర్మాత, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ అయిన ‘దిల్ రాజు’ మహేష్, బన్నీ ఇద్దరు సినిమాలను తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అయితే రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అంటే ఖచ్చితంగా థియేటర్స్ సమస్య వస్తుంది. థియేటర్స్ ఇవ్వకుంటే ఇద్దరు హీరోల నుంచి వ్యతిరేకత వస్తుంది. అందుకే తాజాగా దిల్ రాజు మహేష్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఉంచుకొని అల వైకుంఠపురం డిస్ట్రిబ్యూషన్ ను వదులుకోవాలని ఆలోచిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.

అల వైకుంఠపురం నిర్మాతలు సినిమా తేదీని ప్రకటించాక రిలీజ్ పై నిర్ణయం తీసుకుందామని దిల్ రాజు వేచిచూస్తున్నారట.. జనవరి 11న మహేష్ ‘సరిలేరు’, 12న బన్నీ ‘అల వైకుంఠపురం’ సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ ఇద్దరి వల్ల ఎవరో ఒకరు తీవ్రంగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే తాజాగా బన్నీ తన సినిమాను జనవరి 10న రిలీజ్ చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం.దీంతో మహేష్ బాబు టీం అవాక్కైందట.. మహేష్ బాబు సైతం జనవరి 10నే సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -