Thursday, April 25, 2024
- Advertisement -

భార్యతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజు..!

- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవలే అతి కొద్ది మంది సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ‘దిల్’ రాజు పెళ్లి చేసుకుంది కూడా వాళ్ల బంధువుల అమ్మాయినే. ఆమె పేరు తేజస్విని. ఈమె ఎయిర్హోస్టెస్గా పనిచేసిందట. మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత మరణించడంతో కొద్ది రోజులుగా దిల్ రాజు ఒంటరిగా ఉంటున్నాడు. అయితే దిల్ రాజు కూతురు హన్షిత తన తండ్రికి జీవితంలో ఓ తోడు కావాలని భావించి ఆయనను రెండో పెళ్లికి ఒప్పించింది.

కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంగా దిల్ రాజు.. ఇన్నిరోజులు కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంట్లోనే ఉన్నాడు. అయితే తాజాగా ఈ నవ దంపతులు లాక్ డౌన్ సడలింపులు లభించడంతో తిరుమల శ్రీనివాసుని దర్శనం చేసుకున్నారు. శనివారం ఉదయం దిల్ రాజు ఆయన భార్యతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం వారిద్దరూ తిరుమలలో ప్రత్యక్షమైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ నవ దంపతులకు సోషల్ మీడియా వేదికగా వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు.. సినీ ప్రముఖులు తిరుమల స్వామిని దర్శించుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక దిల్ రాజు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’ సినిమా నిర్మిస్తున్నాడు. ఇది కాక ’వి’ సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ సినిమాలో నాని, సుధీర్ బాబు హీరోలుగా నటించారు. థియేటర్లు ఓపెన్ అవ్వగానే ఈ సినిమా రిలీజ్ కానుంది.

సింగర్ సునీత కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్..!

మెగా డాటర్ నిహారికకు కాబోయే భర్త ఇతనే..!

జబర్దస్త్ కి నా వల్ల కూడా హైప్ వచ్చింది : అనసూయ

చిరంజీవి, నాగార్జున లపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -