Friday, March 29, 2024
- Advertisement -

గుణశేఖర్ హిరణ్య కశ్యప పై క్లారిటీ ఇచ్చినట్లేనా..?

- Advertisement -

రుద్రమదేవి సినిమా తర్వాత దర్శకుడు గుణశేఖర్ దగ్గరినుంచి ఎలాంటి సినిమా రాలేదు.. అయన ఎన్నో కలలు కన్న సినిమా హిరణ్యకశ్యప పై నే ఇన్ని రోజులు వర్క్ చేసుకుంటూ వచ్చాడు. కానీ చివరికి ఆ సినిమా పక్కన పెట్టి వేరే సినిమా చేయబోతున్నట్లు ఇప్పుడు అందరికి ఓ క్లారిటీ వచ్చింది.. రానా హీరో గా ఈ సినిమా చేసి తిరిగి తన పూర్వ వైభవం తెచ్చుకోవాలని గుణశేఖర్ అనుకున్నాడు.. కానీ అది వర్కౌట్ కాలేదు.. ప్రధాన పాత్రకు రానాను ఎంచుకోవడమే కాదు.. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్లో తెరకెక్కాల్సిన ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసేందుకు సురేష్ బాబును ఒప్పించాడు కూడా. కరోనాకు ముందు అయితే ఈ సినిమా పట్ల సురేష్ బాబు ఆసక్తితోనే కనిపించాడు. ఆర్థిక వనరులు కూడగట్టే ప్రయత్నం కూడా చేశారు.

కానీ కరోనా దెబ్బకు కథ మారిపోయింది. టాలీవుడ్లో పేరుమోసిన ఫైనాన్షియర్లందరూ కూడా ఆర్థికంగా దెబ్బ తిన్నారు. నిర్మాతలందరికీ కాసుల కటకట మొదలైంది. బడ్జెట్లు తగ్గించుకోక తప్పని పరిస్థితి. భారీ చిత్రాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించక తప్పట్లేదు. ఈ నేపథ్యంలో ‘హిరణ్య కశ్యప’ లాంటి రిస్కీ ప్రాజెక్టును ఇప్పుడు తలకెత్తుకోవడం అంటే సాహసమే. అందుకే సురేష్ బాబు ఆ ప్రాజెక్టును హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రచారం నిజమే అని రుజువు చేస్తూ గుణశేఖర్ తాజాగా తననుంచి వస్తున్న ఓ లవ్ స్టొరీ సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు..

శాకుంతల అనే పేరు తో మహాభారతంలో ని ఓ ఘట్టాన్ని ఈ చిత్రంలో అవిష్కరించాబోతున్నారని తెలుస్తుంది. నిన్న రాత్రి రాత్రి 7 గంట‌ల 11 నిమిషాల‌కు ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్ డేట్ రాగ ఈ సినిమా లుక్ చూస్తుంటే గుణశేఖర్ పనితనం క్లియర్ గా కనిపిస్తుంది. మణిశర్మ సంగీతం వహిస్తున్న ఈ సినిమా 2021 లో రిలీజ్ అవుతుందని చెప్తున్నారు..

అనిల్ రావిపూడి కి ఏ దిక్కు లేకనే ఈ సినిమా చేస్తున్నాడా..

విజయ్ కి త్రుటిలో జారిన రికార్డు..?

పుష్ప సినిమా షూటింగ్ పై ఇంకా వీడని సందేహం..

బాబోయ్ దసరా కి మా సినిమాలను రిలీజ్ చేయం..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -