- Advertisement -
తెలంగాణ రాష్ట్రా అసెంబ్లీ ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజార్టీ సాధించింది.దాదాపు 95 సీట్లలో విజయం సాధించింది టీఆర్ఎస్ పార్టీ.తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు.దర్శకుడు హరీష్ శంకర్ కూడా కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు.
కేసీఆర్ ఫామ్ హౌస్ విషయాన్ని ఆధారంగా చేసుకొని హరీష్ చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘ఫామ్ హౌస్ లో ఉన్నారో.. ఫామ్ లో ఉన్నారో.. తేల్చి చెప్పిన జనం అంటూ హరీష్ చేసిన ట్విట్ అందరిని ఆకర్షిస్తుంది.కేసీఆర్ ప్రజాస్వామ్యం పవర్ ఏంటో చూపించారని హరీష్ తన ట్విట్టర్లో పెర్కొన్నారు.ఈ సందర్భంగా హరీష్ టీఆర్ఎస్ పార్టీకి ,కేసీఆర్,కేటీఆర్లకు అభినందనలు తెలిపారు.