Friday, April 26, 2024
- Advertisement -

రూటు మారుస్తున్న దర్శకుడు క్రిష్!

- Advertisement -

క్రిష్ జాగర్లమూడి.. తెలుగు సినిమా పరిశ్రమ లో గమ్య సినిమా తో అరంగేట్రం చేసి మెల్లగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని మంచి ఫీల్ ఉన్న సినిమాలు తీస్తారు అనే పేరు ని సొంతం చేసుకున్నాడు. కమర్షియల్ సినిమా నే చేసిన అందులో హృదయానికి హత్తుకొనే ఒక ఎమోషన్ ని జోడించి సినిమా చేస్తారు అనే టాక్ ఉండటం తో ఆయన స్టార్ డైరెక్టర్ గా వెలుగొందారు. బాలకృష్ణ తో గౌతమీపుత్ర శాతకర్ణి తీసిన వెంటనే ఎన్టీఆర్ బయోపిక్ కూడా తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తెలుగు లో నే కాకుండా హిందీ లో కూడా దర్శకుడి గా క్రిష్ కి మంచి పేరు ఉంది.

అయితే ఇప్పుడు తాజా సమాచారం మేరకు ఆయన కొన్ని రోజులు దర్శకత్వానికి దూరం గా ఉండాలి అని అనుకుంటున్నారట. ఎన్టీఆర్ బయోపిక్ ప్లాప్ అవ్వడం తో చాలా విమర్శలు వచ్చాయి. అలాగే హిందీ లో మణికర్ణికా కూడా అదే టైం లో విడుదల అయ్యి వివాదం లో కి వెళ్లడం తో క్రిష్ కొంత నిరుత్సాహానికి గురి అయ్యారట. అయితే ఆయన ఇప్పుడు డిజిటల్ రంగం లో వెబ్ సిరీస్ లు నిర్మించేందుకు రెడీ అవుతున్నారట. ఆయనే కథ, స్క్రీన్ప్లే, డైలోగ్స్ అందిస్తూ నిర్మాణం చూసుకోవాలని భావిస్తున్నారట.

ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్ట్స్ సిద్ధం గా ఉండటం తో పలు ఛానెల్స్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -