Thursday, April 25, 2024
- Advertisement -

ప్రభాస్ 20వ ఓపెనింగ్ ఫోటోలను షేర్ చేసిన డైరెక్టర్ రాధాకృష్ణ..!

- Advertisement -

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాధించుకుని ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా తర్వాత సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించినంత పెద్ద హిట్ కాకపోయిన కలెక్షన్స్ పరంగా బానే లాక్కొచ్చింది.

ఈ సినిమా తర్వాత జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాకి ఓకే చెప్పాడు. ఇది ప్రభాస్ కెరీర్ లో 20వ చిత్రం. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇదో పీరియాడికల్ లవ్ స్టోరీ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కొంత వరకు షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఈ సినిమా ఓపెనింగ్ గతంలో జరినప్పుడు ఫోటోలు ఏవీ కూడా బయటకు రాఏదు. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు రాధాకృష్ణ నాడు సినిమా ముహూర్తం షాట్ సందర్భంగా తీసిన ఫొటోలను తాజాగా తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ ఫోటోల్లో ప్రభాస్, రాజమౌళి, పూజా హెగ్డె, కృష్ణరాజు, దర్శకుడు రాధాకృష్ణ, వినాయక్, యూవీ క్రియేషన్స్ నిర్మాతలు తదితరులు ఉన్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ మళ్లీ లాక్ డౌన్ అనంతరం మొదలు కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -