Thursday, April 25, 2024
- Advertisement -

అప్ప‌ట్లో బ్ర‌హ్మానందం…ఇప్పుడు చంద్ర‌బాబు వ‌ర్మ సెటైర్‌..

- Advertisement -

కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్న వ‌ర్మ మ‌ళ్లీ బాబుపై ట్వీట్లు ఎక్కుపెట్టారు. ప్ర‌స్తుతం జ‌ర‌గుతున్న ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో బాబుపై సెటైరిక‌ల్ ట్వీట్ చేశారు. తాను తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపీలో విడుదల కాకుండా అడ్డుకున్నారనో లేక మరే ఇతర కారణమో తెలియదు కానీ… ఏ మాత్రం అవకాశం వచ్చినా ఆయన టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా బాబుపై మ‌రో సారి ట్విట్ట‌ర్‌లో విమ‌ర్శించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడిన ప్రతీసారి ముఖ్యమంత్రి జగన్ నవ్వుల్లో మునిగిపోతున్నారని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. సినిమా తెరపై బ్రహ్మానందం వచ్చినప్పుడు మాత్రమే జనాలు ఇలా నవ్వడాన్ని తాను చూశానని వ్యాఖ్యానించారు. కాబట్టి టీడీపీ ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో కామెడీ ట్రాక్ గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. గతంలోనూ అనేకసార్లు చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వర్మ… తాజాగా మరోసారి ఆయనపై ఈ రకమైన సెటైర్లు వేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -