Friday, March 29, 2024
- Advertisement -

మ‌హేశ్ బాబును క‌లిసి క్ష‌మించ‌మని కోరిన సుకుమార్‌

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబుని ద‌ర్శ‌కుడు సుకుమార్ క‌ల‌వ‌డం చ‌ర్చ‌నీయంశంగా మారింది. రంగ‌స్థ‌లం వంటి హిట్ సినిమా త‌రువాత మ‌హేశ్ బాబుతో త‌దుప‌రి సినిమా చేయ‌డానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు సుకుమార్‌. అయితే చివ‌రి నిమిషంలో వీరి సినిమా క్యాన్సిల్ అయింది. సుకుమార్ చెప్పిన క‌థ మ‌హేశ్ బాబుకు న‌చ్చ‌క‌పోవ‌డంతో అత‌నితో సినిమాను ర‌ద్దు చేసుకున్నాడు మ‌హేశ్‌. మ‌హేశ్ రిజెక్ట్ చేయ‌టంతో వెంట‌నే అల్లు అర్జున్‌తో సినిమాను ప్ర‌క‌టించాడు సుకుమార్‌. దీంతో సుకుమార్‌పై మ‌హేశ్ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుడు కూడా సుకుమార్‌ని విమ‌ర్శించారు.

మ‌హేశ్‌కు కథ న‌చ్చ‌కపోతే, వేరే క‌థ చెప్పి ఒప్పించాలి కాని ,ఇలా వేరే హీరోతో సినిమా చేయ‌డం ఏంట‌ని చాలామంది సుకుమార్‌ను సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మ‌హేశ్ బాబు మాత్రం హుందాగా సుకుమార్ తీయ‌బోయే సినిమాకు విషెష్ చెప్పాడు. అయితే తెర వెనుక దీనికి సంబంధించిన కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని టాక్. మ‌హేశ్‌తో సుకుమార్‌కు మంచి స్నేహ‌బంధం ఉంది. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి 1 నేనొక్కిడినే సినిమా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల్ అయిన‌ప్ప‌టికి సుకుమార్‌కు ఈ సినిమాలో చాలామంచి పేరు వ‌చ్చింది. ఈ సినిమా నుంచే టాలీవుడ్ టాప్ హీరోలు సుకుమార్‌కు ఛాన్స్‌లు ఇవ్వ‌డం మొద‌లు పెట్టారు. స్నేహ‌బంధం చెడ‌గొట్టుకోవ‌డం ఇష్టంలేక‌నే సుకుమార్ ప్రత్యేకంగా మహేష్‌ని కలిసినట్లు సమాచారం. మ‌హేశ్ ప్ర‌స్తుతం మ‌హేశ్ బాబు మ‌హ‌ర్షి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా షూటింగ్ చైన్నైలో జ‌రుగుతోంది. మ‌హేశ్ కోసం అక్క‌డికి వెళ్లి మ‌రి క‌లిసిన‌ట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్‌తో తీయ‌బోయే సినిమా గురించి , త‌న‌ను క్ష‌మించ‌మ‌ని మ‌హేశ్‌ను కోరాడ‌ట సుకుమార్‌. తొంద‌ర‌ప‌డి సినిమా అనౌన్స్ చేశాన‌ని చెప్పి మ‌హేశ్‌కు సారీ చెప్పార‌ట సుకుమార్‌. దీనికి మహేశ్ నుంచి సానుకుల స్పంద‌న వ‌చ్చింద‌ట‌. మంచి క‌థ‌తో వ‌స్తే త‌ప్ప‌కుండా సినిమా చేద్దామ‌ని సుకుమార్‌తో చెప్పాడ‌ట మ‌హేశ్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -