దర్శకుడు తేజ ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా హిట్తో ఫాంలోకి వచ్చాడు. ఈ సినిమా తరువాత రెండు క్రేజీ ప్రోజెక్ట్స్ తీస్తున్నట్లు ఎనౌన్స్ చేశాడు. అందులో ఒకటి విక్టరీ వెంకటేష్తో సినిమా.ఈ సినిమాకు సురేష్ ప్రొడక్షన్ నిర్మిస్తున్నారు. ఇంతలో శ్రీరెడ్డి ఇష్యు రావడం,ఈ గొడవలో సురేష్ బాబు కొడుకు అభిరాం ఉండటం … తేజ తన సినిమాలో శ్రీరెడ్డికి అవకాశం ఇవ్వడంతో ఈ సినిమాను ఆపేశారు.అసలు ఇష్యూని సెటిల్మెంట్ చేయమని తేజని శ్రీరెడ్డి దగ్గరకు పంపితే, తేజ ఎంటర్ అయిన తరువాత గొడవ మరింత ముదిరింది.దీంతో తేజ ఈ సినిమా నుండి తప్పుకున్నారు.ఇక రెండోవ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ నుండి కూడ తేజ తప్పుకున్నారు.
తేజ బయటకు ఈ సినిమాను సరిగా తీయలేనని చెప్పిన, బాలయ్యకు తేజకు మధ్య గొడవలు కారణంగానే తేజ ఈ సినిమా నుండి తప్పుకున్నాడని సమాచారం.ఇక రెండు పెద్ద సినిమాల నుండి తప్పుకున్న తేజ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.మరో సీనియర్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.హీరో నాగర్జునతో తన తరువాత సినిమా తీయలనుకుంటున్నాడు.నాగర్జున కూడా వర్మ ఆఫీసర్ సినిమా కంప్లీట్ చేశాడు. నాగ్ తన తరువాత సినిమాపై ఎటువంటి క్లారీటి లేదు.మరి తేజతో సినిమా అంటే నాగ్ ఒప్పుకుంటాడా అనేది చూడాలి.