Friday, March 29, 2024
- Advertisement -

తేజ‌తో మ‌ళ్లీ రానా?

- Advertisement -

హీరో రానా వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. బాహుబ‌లి ,ఘాజీ,నేనే రాజు నేనే మంత్రి వ‌రుస హిట్ల‌తో మంచి జోష్‌లో ఉన్నాడు.రానా ఎప్ప‌డు విభిన్న‌మైనా సినిమాలు చేస్తు త‌న కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నాడు.త‌న‌కు నేనే రాజు నేనే మంత్రి లాంటి హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు తేజ‌తో మ‌ళ్లీ జ‌త‌క‌ట్ట‌నున్నాడు.తేజ ప్ర‌స్తుతం బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమా త‌రువాత తేజ హీరో వెంక‌టేష్‌తో ఓ సినిమా ప్లాన్ చేశాడు.

కాని ఈ సినిమా ఆగిపోవ‌డంతో ఆ సినిమాను రానాతో తీయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం.రానా కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. ఇది పీరియాడిక్ ఫిలిం కావడం విశేషం. 1971లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంతో ఈ మూవీ సాగనుందని తెలుస్తోంది. మ‌రి ఇదే నిజం అయితే రానాకు తేజ మ‌రో హిట్ ఇవ్వ‌డం ఖాయం అని అనుకుంటున్నారు రానా ఫ్యాన్స్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -