తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేసిన మహానుభావుడు, తెలుగువారి ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు బయోపిక్ తెరమీదరకు రానుంది. బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్గా ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. . ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే.
ఇటీ వలే హైదరబాద్లో రామకృష్ణ స్టూడియోస్లో ‘యన్.టి.ఆర్’ చిత్రం షూటింగ్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి తొలి షాట్కు క్లాప్ కొట్టారు. దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం రామకృష్ణ స్టూడియోస్లో వేసిన కౌరవ సభ సెట్లో తొలి చిత్రీకరణ జరిగింది.
ఈ సినిమా నుంచి తేజా తప్పుకోవడం నందమూరి అభిమానులకు మింగుడు పడని అంశమనే చెప్పవచ్చు. ఎందుకు ఈ సినిమానుంచి తేజా తప్పుకున్నారనేది సస్పెన్స్గా మారింది. సినిమాను త్వరగా పూర్తిచేయాలనే ఒత్తడి వల్లే తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత 15 రోజులుగా ఇదే విషయంపై ముల్లగల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రెజర్ తట్టుకోలేకే ఈ ప్రాజెక్టునుంచి తప్పుకున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు ఈ చిత్రంగురించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమా నుంచి తేజ తప్పుకున్నట్లు సినీ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తేజా తప్పుకోవడంతో ఈ సినిమాను రాఘవేంద్రరావుతోగాని, క్రిస్తో గాని డైరెక్సన్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. హటాత్తుగా తేజ తప్పుకోండం వెనుక పూర్తి కారణాలు ఏంటవనేది తెలియాల్సి ఉంది.