Friday, April 26, 2024
- Advertisement -

రానా కోసం మరో హాట్ బ్యూటీ

- Advertisement -

వేణు ఉడుగుల దర్శకత్వం లో రానా దగ్గుబాటి ప్రస్తుతం విరాట పర్వం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎంత గొప్ప విజయం సాధిస్తుందా అని ఇప్పటి నుంచే మాట్లాడుకోవడం మొదలు పెట్టారు అందరూ. నీది నాది ఒకే కథ అనే సినిమా తో అందరినీ మెప్పించిన దర్శకుడు ఈ సినిమా తో మన ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సినిమా లో ఇప్పటికే సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా, టబు ఒక ముఖ్య పాత్ర ని పోషిస్తుంది. ఈ సినిమా లో ఇంకా చిన్న చిన్న ముఖ్య పాత్ర లు చాలా ఉన్నాయట. వాటిని పేరున్న నటుల తో చేయిస్తే బాగుంటుంది అని అందరూ భావిస్తున్న సంగతి తెలిసిందే.

ఇకపోతే, ప్రస్తుతం ఒక కీలక పాత్ర కోసం దిశా పథాని ని అప్రోచ్ అవ్వనున్నారట దర్శక నిర్మాతలు. దిశా అయితే ఆ పాత్ర కి కచ్చితంగా సరిపోతుందని, అందుకే దిశా ని ఎలాగైనా సినిమా లో కి తీసుకొని రావాలని అనుకుంటున్నారట. ఈ విషయమై చర్చలు మొదలయ్యాయి కానీ, తెలుగు లో అప్పుడెప్పుడో లోఫర్ చేసిన దిశా మళ్ళీ తెలుగు కి వస్తుందా రాదా అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -