నాగచైతన్య, నిధి అగర్వాల్ నటిస్తున్న సినిమా ‘సవ్యసాచి’. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమా ఫస్ట్లుక్ ఇటీవల విడుదల చేశారు. సీనియర్ నటి భూమిక, తమిళ నటుడు మాధవన్ చైతూ అక్కబావలుగా నటిస్తున్నారు. ఈ సినిమా అనేక మలుపులతో ట్విస్ట్ల మీద ట్విస్ట్ల ఉండి ఆసక్తికరంగా తీర్చిదిద్దారని సమాచారం.
నాగ చైతన్య, భూమిక అక్కాతమ్ముడు. భూమిక భర్త మాధవన్. భూమిక చైర్మన్గా ఉన్న కంపెనీని మాధవన్ మోసం చేస్తాడు. మొదట తన బావను గమనించని చైతై చివరకు తన బావనే మోసం చేశాడు అని గుర్తించి ఏం చేశాడు అనేది సినిమా స్టోరీ అని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో చైతూకు ఓ లోపం ఉంది.. ఆ లోపంతో మాధవన్ ఏం చేశాడు అనేది ఆసక్తికరంగా ఉండనుంది. ఈ విధంగా జరిగే పోరాటంలో చివరికి బావనా.. బామ్మర్ది గెలుస్తాడా అనేది సినిమా కథగా ఉండనుంది అని సమాచారం.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జూన్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.