హీరోయిన్ పూనమ్ కౌర్ గత కొంత కాలం లో సోషల్ మీడియా లో తన పోస్ట్స్ తో హల్చల్ చేయడం మొదలు పెట్టింది. తను ఏ పోస్ట్ పెట్టినా కానీ దానికి విపరీతమైన అటెన్షన్ రావడం జరుగుతుంది. అయితే అనూహ్యం గా నిన్న పూనమ్ కౌర్ ఎవరినో ఉద్దెశించి పరోక్షం గా ఒక ట్వీట్ వేశారు. ఎవరినో ఉద్దెశించి చెప్తూ వారికి సిగ్గు లేదు అని ఆవిడ విరుచుకు పడ్డారు.
“సిగ్గు లేకుండా ప్రవర్తించడం లో ఇదొక పరాకాష్ట. అసలు కొంత మంది జనాలు తప్పుడు పనులు చేస్తున్నాము అని తెలిసి కూడా ఎలా చేయగలుగుతారో చూస్తుంటే నే విరక్తి వస్తుంది.” అని పూనమ్ కౌర్ ట్వీట్ వేశారు.
అయితే ఈ ట్వీట్ వేసిన దగ్గర నుండి పూనమ్ కౌర్ ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి అని ఉంటారు అనే వార్తలు ఎక్కువ అయ్యాయి. చాలా మంది కామెంట్స్ లో కి వెళ్ళి గెస్ కొట్టారు కానీ పూనమ్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. చూస్తుంటే ఎవరో బాగానే పూనమ్ ని హర్ట్ చేసినట్టున్నారు.
ప్రస్తుతం పూనమ్ కౌర్ సినిమాలతో బిజీ గా గడుపుతుంది.