Saturday, April 20, 2024
- Advertisement -

రాజశేఖర్ ఏం చేయాలనుకుంటున్నారో తెలుసా

- Advertisement -

సీనియర్ హీరో రాజశేఖర్ చేసిన చిత్రం ‘పిఎస్వి గరుడవేగ’. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో తయారైన ఈ సినిమా… నవంబర్ 3న విడుదల అవుతుంది. ఈ సందర్బంగా యాంగ్రీ యంగ్ మేన్ మీడియాతో తన సినిమా తాలూకు విశేషాలు,తన ఫ్యూచర్ కార్యక్రమాలను పంచుకున్నారు. రాజశేఖర్ మాట్లాడుతూ…. నేను చేసిన అన్ని సినిమాల్లోకి బెస్ట్ సినిమా అయ్యే స్టామినా ఈ సినిమాకుంది. నా కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. సుమారు 30 కోట్ల వరకు ఖర్చు పెట్టాం. ఖచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుందంటున్నారు. అలాగే ఇందులో నేను నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలో అధికారిగా కనిపిస్తాను. విచిత్రమేమిటంటే… నా పాత సినిమాలన్నిటిలో నేను ఎమోషనల్ గానే కనిపించాను. కానీ ఇందులో మాత్రం చాలా సహజంగా నటించానని చెప్పారు.

మొదట్లో కేవలం 7, 8 కోట్లల్లో సినిమా చేసేయాలని అనుకుని మొదలుపెట్టాం కానీ నెమ్మదిగా బడ్జెట్ పెంచి గ్రాండియర్ గా తీశాం. ఈ రోజుల్లో సినిమా బాగుంటే డబ్బులు తప్పకుండా వస్తాయి. నేను పరాజయాల్లో ఉన్నప్పుడు చాలా మంది చిన్న క్యారెక్టర్లు, విలన్ పాత్రల కోసం నన్ను అడిగారు. హీరోగా అయితే కేవలం 3 కోట్ల వరకే బడ్జెట్ పెడతామని అనేవారు. అలాంటి పరిస్థితిలో ప్రవీణ్ ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాను నా దగ్గరకు తీసుకురావడం గొప్ప విషయం.

తల్లి చనిపోయాక డిప్రెషన్లోకి వెళ్లిన రాజశేఖర్ …ఈ సినిమా విజయాన్ని ఆమె స్వయంగా చూడాలని అనుకున్నారు. కానీ అది కుదరలేదు.ఈ సినిమా తర్వాత మంచి సపోర్టింగ్ రోల్స్, ప్రతి నాయకుడి పాత్రలు వస్తే చేస్తారంటే చేస్తాను అని చెప్పారు. పాత్రలో, కథలో దమ్ముంటే చేస్తాను. ఇక ‘ధృవ’ లో అరవిందస్వామి చేసిన తరహా నెగెటివ్ రోల్స్ వచ్చినా చేస్తాను.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -