Friday, April 26, 2024
- Advertisement -

ప్రభాస్ పైన రూమర్ నీ ఎంజాయ్ చేస్తున్న ఫాన్స్.

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమలో అనేక మంది అగ్ర హీరోలు వున్నారు. మన తెలుగు మీడియా ఎప్పటికప్పుడు మన హీరోల మీద ఏవో కొత్త కబుర్లు రాస్తూ వైరల్ చేస్తూ వుంటాయి. తాజా గా సాహో చిత్రం షూటింగ్ తో బిజీ గా వున్న ప్రభాస్ గురించిన ఒక వార్త సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.

తాజా ఫిలిమ్ నగర్ సమాచారం మేరకు ప్రభాస్ అతి త్వరలో తన సన్నిహిత స్నేహితులతో కలిసి ఒక టీవీ చానెల్ నీ ప్రారంభించనున్నారు అనే వార్తలు అంతటా వ్యాపించాయి. ఇప్పటికి అయితే దీని మీద అధికారిక ప్రకటన ఏమీ లేనప్పటికీ ఈ వార్త మాత్రం ఒక రేంజ్ లో హల్చల్ చేస్తుంది. నిజం గా ప్రభాస్ ఒక టీవీ ఛానల్ పెడుతున్నడా అనే ఆసక్తి, న్యూస్ బయటకి వచ్చినప్పటి నుండి ఇటు తెలుగు లోనూ అటు హిందీ లోనూ తమిళ, మలయాళ భాష లో వున్న ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైతే ప్రభాస్ కానీ ప్రభాస్ అనుచరులు కానీ ఈ విషయం మీద స్పందించలేదు. సాహొ పూర్తి చేసుకున్న వెంటనే ప్రభాస్ తన తదుపరి చిత్రం వైపు తన ఫోకస్ మళ్ళించనున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడు రాధ కృష్ణ కుమార్. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ మీద నిర్మించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -