Friday, March 29, 2024
- Advertisement -

సాయి పల్లవి అక్క ఆ ఛానల్ ను వదలదట

- Advertisement -

ఫిదా సినిమా చూశారు కదా.అందుల్లో చాలామంది సాయి పల్లవి గురించి ఆమె చేసిన పాత్ర గురించి తెగ చెబుతారుగాని మాంచి టేస్ట్ ఉన్నవారికి ఆమె అక్క రేణుకగా నటించిన శరణ్య ప్రదీప్ నచ్చకుండా ఉండదు. టి న్యూస్ ఛానల్ లో యాంకర్ గా పని చేసే ఈ తెలంగాణ పోరి చాలామందిని గిలిగింతలు పెట్టింది. విచిత్రమేమిటంటే..ఈమె పాత్ర ఏమాత్రం రొమాన్స్ ను ఒలకబోసే డైలాగ్ లు చెప్పకపోయినప్పటికీ..ఈమె చూపులు కుర్రాళ్లను తెగ గిచ్చేసాయి.దాంతో శరణ్య ప్రదీప్ ఫ్యూచర్ పై టాలీవుడ్ జనాలకు ఓ రేంజ్ లో అంచనాలు కనిపించాయి.

కట్ చేస్తే ఈ అమ్మడు సినిమాలకు సైన్ లు చేయకుండా మళ్లీ తనకు లైఫ్ ఇచ్చిన టి న్యూస్ ఛానల్ లోనే విదులు నిర్వహించుకుంటూ కూర్చుంది. ఎవరో ఎందుకమ్మా సినిమాలు చేయట్లేదు అంటే…తనకు నచ్చిన పాత్రలు వస్తేనే చేస్తాను..ప్రొడక్షన్ పై నమ్మకం ఉంటేనే కాల్షీట్లు ఎడ్జెట్ చేస్తానని చెబుతొందట.దాంతో శరణ్య ప్రదీప్ కమిట్ మెంట్ పై పలువరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏమాత్రం రొమాంటిక్ గా మట్లాడకుండానే అంతలా గిచ్చిన ఈ సుందరి రేపు మరో మంచి చిత్రంలో కనిపించి ఏకంగా సెకండ్ హీరోయిన్ గా తళుక్కుమంటే.. ఫిదాలో ఈమెను చూసి మనసు పారేసుకున్న సినీ లవర్స్ గుండెల్లో ల్యాండ్ మైన్ పేలినా పేలొచ్చు.కాదంటారా.చూద్దాం మరో చిత్రంలో శరణ్యప్రదీప్ ఎలాంటి పాత్రతో అలరిస్తుందో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -