Friday, March 29, 2024
- Advertisement -

బాలీవుడ్ సినిమా రీమేక్ చేయనున్న హరీష్ శంకర్

- Advertisement -

ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ‘డీజే’ సినిమా తో డిస్ట్ర కొంతకాలం దూరంగా మళ్లీ చాలా కాలం తరువాత అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 20న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం హరీష్ శంకర్ త్వరలోనే ఒక బాలీవుడ్ సినిమాని రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘అంధాదున్’ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

యువ హీరో నితిన్ ఈ సినిమా రీమేక్ రైట్స్ ని 3.9 కోట్లు చెల్లించి మరి కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం దర్శకత్వం వహించడానికి హరీష్ శంకర్ ని సంప్రదించినట్లు సమాచారం. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ మరియు వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ ఈ సినిమా రీమేక్ ని నిర్మించనున్నారు. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. మరోవైపు నితిన్ ప్రస్తుతం ‘భీష్మ’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ‘రంగ్ దే’ అని మరొక సినిమాలో నటించనున్నాడు నితిన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -