Thursday, April 25, 2024
- Advertisement -

హీరో రాజశేఖర్ ఫ్యామిలీ మొత్తానికి కరోనా..!

- Advertisement -

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ మరియు అతని ఫ్యామిలీ కరోనా భారిన పడినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంను స్వయంగా రాజశేఖరే తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. “నేను నా భార్య జీవిత కరోనా బారిన పడిన సంగతి నిజమే. మాతో పాటు మా ఇద్దరు కుమార్తెలకు కూడా కరోనా సోకింది. అయితే వారిద్దరు కోలుకున్నారు.

ప్రస్తుతం మేము హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. కంగారు పడాల్సింది ఏం లేదు. మేము ఇప్పుడు బానే ఉన్నాం. త్వరలోనే కోలుకుని ఇంటికి వెళ్తాం” అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. వాస్తవానికి రాజశేఖర్ ఫ్యామిలీ వారం క్రితమే అనారోగ్యం పాలయ్యారట. అయితే కరోనా సోకిన విషయం వారికి లేట్ గా తెలిసిందట. ఇక రాజశేఖర్ సినిమాల విషయంకు వస్తే.. రాజశేఖర్ ప్రస్తుతం నీలకంఠ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి అంగీకరించారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇంతలోనే రాజశేఖర్ అనుకోకుండా కరోనా భారిన పడ్డారని తెలుస్తోంది. ‘కరోనా విజృంభణ ప్రస్తుతం తగ్గింది’ అని అందరూ అంటున్నారు. అయితే సెలబ్రిటీలు మాత్రం దీని భారిన పడుతూనే ఉండడం ఆందోళన కలిగించే విషయం. ఇప్పటీకే రాజమౌళి ఫ్యామిలీతో పాటు.. కీరవాణి, నాగబాబు,తమన్నా వంటి స్టార్స్ కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.

శంకర్ దాదా సక్సెస్.. హీరోలందరు కలిసిన వేళ.. ఫోటో వైరల్..!

పవన్ కళ్యాణ్ తన సినిమాలపై గట్టిగానే ఫోకస్ పెట్టాడే..?

క్యాన్సర్‍తో పోరాడి గెలిచిన సెలబ్రిటీలు వీరే..!

ఒక్క సినిమాతో కనిపించకుండాపోయిన హీరోయిన్స్ వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -