Friday, March 29, 2024
- Advertisement -

తాతయ్య, మావయ్యలతో అనోసరంగా సినిమాలు చేశా : సుమంత్

- Advertisement -

అక్కినేని నాగేశ్వర రావు మనవడు.. నాగార్జున మేనల్లుడు సుమంత్ ప్రేమకథ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతని కెరీర్ లో కొన్ని హిట్లు కొన్ని ప్లాపులు ఉన్నాయి. గతేడాది వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో నాగేశ్వర రావు పాత్ర చేశాడు. అయితే కెరీర్ మొదట్లో తాతయ్య, మామయ్యలతో సినిమాలు చేసి చాలా పెద్ద తప్పు చేశాను అంటున్నాడు సుమంత్. ఆయన మాట్లాడుతూ.. ” మా తాత, మామయ్యలతో సినిమాలు చేసి తప్పు చేశా.

నాగార్జునతో కలిసి ‘స్నేహమంటే ఇదేరా’ సినిమా చేశాను. ఈ సినిమా ప్లాప్ అవుతుందని నాకు ముందే తెలుసు. ఆ సినిమా చేస్తున్నప్పుడే ప్లాప్ అనిపించింది. కానీ ఏం చేయలేకపోయా. నిజ జీవితంలో మామ అల్లుళ్లమైన మేమిద్దరం సినిమాల్లో ఫ్రెండ్స్ లా కనిపించే సరికి ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు. ‘స్నేహమంటే ఇదేరా’ మలయాళంలో హిట్టైన ‘ఫ్రెండ్స్’ చిత్రానికి రీమేక్. ఈ సినిమాని తమిళంలో సూర్య, విజయ్ లు చేశారు. ఒర్జినల్ వెర్షన్‌ డైరెక్ట్ చేసిన సిద్దికే తమిళ్ లో రీమేక్ చేసాడు. అక్కడ ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే తెలుగులో మాత్రం ప్లాప్ అయింది.

ఇక మావయ్య నాగార్జునను ఈ సినిమాలో కొట్టే సీన్ ఉంది. ఆ సీన్ తీసేటపుడు నాకు చాలా బాధ వేసింది. అందుకే ఆ సినిమా చేయడం నేను జీవితంలో చేసిన పెద్ద తప్పు అని ఫీలవుతూ ఉంటాను. ఇక తాతయ్యతో ‘పెళ్లి సంబంధం’ సినిమా చేశాను. రాఘవేంద్రరావు గారు బలవంతం చేయడంతో ఆ సినిమా చేశాను. కానీ ఆ సినిమా కూడా ప్లాప్ అయింది. తాతయ్య, మామయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే ఆరాటంతో నేను ఆ సినిమాలు చేశాను. కానీ తర్వాత అర్దం అయింది. సరైన స్క్రిప్ట్ ఎంచుకోలేదని అందుకే వాళ్ళతో సినిమాలు చేసి తప్పు చేశాను అని ఫీల్ అవుతుంటా” అంటూ సుమంత్ చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -